![తెలంగాణలో రైతే రాజు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/RYTHU-VEDIKAAA-AJAY-PUVVADA.jpg?fit=700%2C391&ssl=1)
సారథి న్యూస్, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం నగరం ఏడో డివిజన్ అల్లిపురంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర్రావు, జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల పాల్గొన్నారు.