సారథి న్యూస్, హైదరాబాద్: శాసనమండలి మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నేత స్వామిగౌడ్ ఆ పార్టీని వీడారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. స్వామి గౌడ్ వెంట ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ..బీజేపీలో చేరడమంటే తన తల్లి గారింటికి వచ్చినట్లు భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ జెండా పట్టని వారికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, తమను ఎండలో నిలబెట్టారని విమర్శించారు. వందసార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరానని ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం దొరుకుతుందనే ఉద్దేశంతోనే బీజేపీలో చేరానని అన్నారు. టీర్ఆర్ఎస్లో చాలామంది అవమానాలకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.
- November 25, 2020
- Archive
- Top News
- పొలిటికల్
- BJP
- CM KCR
- JP NADDA
- SWAMYGOUD
- TRS
- జేపీ నడ్డా
- టీఆర్ఎస్
- బీజేపీ
- మండలి మాజీ చైర్మన్
- స్వామిగౌడ్
- Comments Off on టీఆర్ఎస్కు స్వామిగౌడ్ గుడ్ బై