![టాబ్లెట్స్ లారీలో మంటలు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/LORRY-2F.jpg?fit=750%2C346&ssl=1)
సారథి న్యూస్, షాద్నగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడ వద్ద బెంగళూరు హైవేపై ఆదివారం ఉదయం ఓ కంటెయినర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ లారీని పక్కన పార్క్ చేశాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శంషాబాద్ పొలీసులు ఫైర్ సిబ్బందిని అలర్ట్చేసి మంటలను ఆర్పివేయించారు. బెంగళూరు నుంచి మైక్రో ల్యాబ్ కు సంబంధించిన ట్యాబ్లెట్ లోడుతో వస్తున్న కంటెయినర్శంషాబాద్ ఘాన్సిమియాగూడ వద్దకు రాగానే అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.