![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/jan2.jpg?fit=719%2C1280&ssl=1)
ప్రస్తుతం బాలీవుడ్లో రైజింగ్ హీరోయిన్ల జాన్వీకపూర్ ఒకరు. అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు.. కపూర్ వంశపు రాజకుమారి. ‘ధడక్’ సినిమాతో అందరి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా వంటి దిగ్గజాల సపోర్ట్తో తన కెరీర్ను భాగానే ప్లాన్ చేసుకుంటోంది. ఈ లోపు కరోనా లాక్ డౌన్ కారణంగా అందరు సెలబ్రిటీలూ చేసేది లేక ఇంటికే పరిమితమయ్యారు. షూటింగ్లు పూర్తయి రిలీజ్కు దగ్గరలో ఉన్న సినిమాలను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసేందుకు చాలామంది ఆసక్తి చూపడమే కాదు ఒకటి రెండు చిన్న సినిమాలు ఆల్ రెడీ రిలీజ్ చేశారు కూడా. అయితే ఈ క్వారెంటైన్ సమయాన్ని అంతా జాన్వీ ఎక్కువ తండ్రి బోనీ కపూర్తో, సిస్టర్ ఖుషీ కపూర్తోనే గడిపిందట. సోషల్ మీడియాకి టచ్లో ఉంటూ తన ఫ్యామిలీ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. అలా తాజాగా జాన్వీ ఓ ఫొటోను షేర్ చేస్తూ దానికి ‘హియర్ లుకింగ్ ఎట్ యూ.. కిడ్’ అంటూ ఓ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ను జోడించింది. దానికి స్పందించిన ఫ్రెండ్ ‘కిడ్ ఎవరు? నీకు కిడ్ ను కనాలని ఉందా?’ అంటూ కవ్వించగా.. దానికి ‘ఎస్’ అంటూ అంతే వేడెక్కించే ఆన్సర్ ఇస్తూ బిగ్ పంచే వేసింది.