Breaking News

చైనా ఆర్మీ రాలేదని చెప్పగలరా?

న్యూఢిల్లీ: చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదని చెప్పగలరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఆ దేశ ఆర్మీ మన దేశంలోకి వచ్చిందా రాలేదా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అడిగారు. ‘చైనా ఆర్మీ మన దేశంలోకి రాలేదనే విషయాన్ని ధ్రువీకరించండి. ఇలా సైలెంట్‌గా ఉంటే ఊహాగానాలు పెరిగిపోతాయి. ప్రజలకు నిజం తెలియాలి’ అని రాహుల్‌ గాంధీ బుధవారం ట్వీట్‌ చేశారు. అంతే కాకుండా చైనా, ఇండియా మిలటరీ అధికారులు శనివారం భేటీ అవుతున్నారని వస్తున్న వార్తలను కూడా షేర్‌‌ చేశారు. సరిహద్దు గొడవలను క్లియర్‌‌ చేయాలని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలని ప్రభుత్వాన్ని కోరారు. చైనా ఆర్మీ కొంత మేర ఈస్ట్రన్‌ లద్దాఖ్‌లోకి వచ్చిందని, కానీ వారిని ఎదుర్కొనేందుకు మన ఆర్మీ కూడా సిద్ధంగా ఉందని, అన్ని చర్యలు తీసుకున్నామని డిఫెన్స్‌ మినిస్టర్‌‌ రాజనాథ్‌ సింగ్‌ చెప్పారు.