Breaking News

ఘనంగా సర్వాయి పాపన్న జయంతి

సారథి న్యూస్, చిన్నశంకరంపేట/ నిజాంపేట: సర్దార్​ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని గౌడసంఘం నేతలు కొనియాడారు. మంగళవారం మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్​ గ్రామంలో సర్దార్​ సర్వాయి పాపన్నగౌడ్​ 370 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్​ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోనూ గౌడసంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్​ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ.. పాపన్నగౌడ్​ పెత్తందారివ్యవస్థపై పోరాడిన యోధుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు పట్లోరి రాజు, స్వతంత్ర కుమార్​గౌడ్, తాళ్ల రాజు గౌడ్, నాయకులు బండారు స్వామి, బాగగౌని సురేశ్​గౌడ్, నాగరాజుగౌడ్, వేణుగౌడ్, మహేశ్​గౌడ్, వంశీ గౌడ్, చింటూగౌడ్ తదితరులు పాల్గొన్నారు.