Breaking News

కోలుకున్న ఢిల్లీ మంత్రి

ఢిల్లీ: ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్​ కరోనా నుంచి కోలుకున్నారు. ‘ఆరోగ్యమంత్రి సత్యేంద్ర ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నారు. సోమవారం నుంచే అయన విధుల్లో చేరతారు. మళ్లీ ఆయన దవాఖానలు సందర్శిస్తారు. కరోనాపై వైద్యశాఖ అధికారులతో సమావేశమవుతారు’ అని ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​చేశారు. కాగా ప్లాస్మాథెరపీ తీసుకోవడం వల్లే ఆయన కోలుకున్నారని వైద్యులు చెప్పారు.