- మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. శనివారం ఆయన రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్ చైర్మన్లతో వీడియోకాన్ఫరెన్స్లో మాట్లాడారు. పల్లెప్రగతి పనులు చేపట్టాలని సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత, పంచాయతీరాజ్ సెక్రటరీలు రఘునందన్ రావు, సందీప్ సుల్తానియా, రంగారెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్ పాల్గొన్నారు.