Breaking News

కందనూలులో కరోనా కలకలం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా సోకగా.. తాజాగా జిల్లా దవాఖానలో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్​ శ్రీధర్​ వెల్లడించారు. నాగర్​కర్నూల్​, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న మొత్తం 27 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చినట్టు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కు, సెక్యూరిటీ సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కలెక్టర్ తెలిపారు. ఇద్దరికి సంబంధించిన ప్రైమరీ కాంటక్ట్స్ ను గుర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.