సారథి న్యూస్, కర్నూలు: ఏపీలో మంగళవారం కొత్తగా 1,155 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 24 గంటల్లో 16,238 శాంపిళ్లను పరీక్షించగా 1,178 కరోనా కేసులు తేలాయి. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 21,197కు చేరింది. తాజాగా 13 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్రంలో 252 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఏపీలో 10,50,090 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 153 కేసులు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 112, గుంటూరు 238, కృష్ణా 100, కర్నూలు 84, శ్రీకాకుళం 104, విశాఖపట్నం జిల్లాలో 123 చొప్పున అత్యధికంగా పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి.
- July 7, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANATHAPURAM
- AP
- CARONA
- అమరావతి
- ఏపీ కరోనా
- Comments Off on ఏపీలోనూ కరోనా అదే తీరు