సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జల్లా రామడుగు మండలంలో ని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు మొక్కుబడిగా సాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్ట రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై వెంటనే దృష్టి సారించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిట్టవేని అంజిబాబు, భరత్ చారి, కనకం శ్రీనివాస్, గజ్జెల అశోక్, మునిగంట శ్రీనివాస చారి తదితరులు ఉన్నారు.
- July 17, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- కరీంనగర్
- కరోనా
- బీజేపీ
- రామడుగు
- Comments Off on ఎక్కడి చెత్త అక్కడే