Breaking News

ఆదివాసీలకు చేయూత

ఆదివాసీలకు చేయూత

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ లో స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సుమారు 30 మంది ఆదివాసీ పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్​ లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.