![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/cm-kcr-final-1.jpg?fit=300%2C413&ssl=1)
సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ లో అల్లనేరేడు మొక్కలను నాటి ప్రారంభించారు. స్థానిక పార్కులో అనేక విశిష్టతలు ఉన్నాయి. సుమారు 630 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ప్రాంతం విస్తరించి ఉంది. రూ.8కోట్ల వ్యయంతో 15కి.మీ. ప్రహరీని సిత్రు వాల్, చైన్ లింక్ ఫినిషింగ్ తో నిర్మాణ చేపట్టారు.