Breaking News

అతిలోక సుందరి రహస్యాలు

ఒకప్పుడు అటు తెలుగు, తమిళం, హిందీ ఇండస్ట్రీలను ఏలిన అతిలోక సుందరి.. లెజెండరీ నటి శ్రీదేవి మరణం వెనుక ఏదో మిస్టరీ ఉందని ఇప్పటికీ అభిమానులు అనుమానిస్తూనే ఉన్నారు. ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లి రెండేళ్లు గడిచినా అదే విషయాన్ని నమ్ముతున్నారు ఫ్యాన్స్. దుబాయ్​లో శ్రీదేవి మరణించాక ఆమె భర్త బోనీ కపూర్ తీవ్రంగా కలతచెందారు. కానీ బోనీ, ఆయన కుమారుడు అర్జున్ కపూర్​పై అభిమానులకు చాలా సందేహాలు వచ్చాయి. కానీ వాటన్నింటికి సరైన సమాధానం ఇప్పటికీ దొరకలేదు. ఇక ఎప్పటికీ దొరకదేమో కూడా. కానీ శ్రీదేవి సోదరి శ్రీలత.. సవతి కుమారుడు అర్జున్ కపూర్.. భర్త బోనీ కపూర్ గురించి.. అలాగే శ్రీదేవి సౌందర్య శస్త్రచికిత్సలు.. ఆర్థిక అస్థిరత గురించి ఆమె మేనమామ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన కొన్ని సంగతులను బట్టి శ్రీదేవి మరణం వెనుక దాగిన కొన్ని విషయాలు నిజమేమో అనిపిస్తాయి.


శ్రీదేవి మరణ సమయానికి ఆమె ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఎంతో బాధతో జీవితాన్ని వెళ్లదీసిందని, పుట్టెడు దుఃఖంతోనే కన్ను మూసిందని వేణుగోపాల్ చెప్పారు. ఎందుకంటే బోనీ కపూర్ నిర్మించిన కొన్ని చిత్రాలు ఫ్లాపులు చవిచూశాయి. దాని కారణంగా ఆయన చాలా డబ్బు పోగొట్టుకున్నాడు.. ఆ నష్టాలను పూడ్చేందుకు శ్రీదేవి ఆస్తులను సైతం అమ్మేశాడని.. అందుకే శ్రీదేవి బెంగతో కృంగిపోయి చివరి క్షణాల్లో కూడా ప్రశాంతంగా కన్నుమూయలేదని రీసెంట్​గా ఒక ఇంటర్వ్యూలో వేణుగోపాల్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆమె అందం కోసం చేయించుకున్న కొన్ని శస్త్రచికిత్సలు.. శ్రీదేవి తల్లికి అమెరికాలో జరిగిన మెదడు ఆపరేషన్​ సందర్భంగా జరిగిన గొడవలు.. శ్రీదేవి సోదరి శ్రీలతతో ఆస్తి తగాదాలు ఇలా అన్నీ కూడా ఆమె జీవితం అస్తవ్యస్తంగానే గడిచిందని చెప్పుకొచ్చారు.


‘బోనీ కపూర్ మొదటి భార్య మోనాకపూర్ కుమారుడు అర్జున్ కపూర్. శ్రీదేవి బోనీ కపూర్​ను వివాహం చేసుకున్న తర్వాత అతడి నుంచి చాలా సవాళ్లను ఎదుర్కొంది. ఫ్యామిలీ విచ్ఛిన్నం అయ్యిందనే కోపంతో అర్జున్ అలా ఉండేవాడని.. బంధువులతో కలిసినప్పుడు శ్రీదేవి మనసు విప్పి మాట్లాడుతుంటే తెలిసింది’అని వేణుగోపాల్ వివరించాడు. ఇంక కుమార్తెలు జాన్వీ, ఖుషీ భవిష్యత్​ గురించి కూడా నిరంతరం ఆలోచించేదని, అంతలో బోనీ ఆరోగ్యం బాగాలేదని, అతని ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తోందని శ్రీదేవి కలతకు గురయ్యారని తెలిపాడు. ఇలా శ్రీదేవి జీవితం ఎంతోకొంత దుఃఖం నిండి ఉంది. అన్ని కష్టాల మధ్య దుబాయ్ కి పెళ్లి వేడుక కోసం వెళ్లి అక్కడే ఆకస్మికంగా బాత్ టబ్ లో జారిపడి మృతిచెందారు. తర్వాత ఆమె కూతురు జాన్వి ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్​లో ఎంట్రీఇచ్చింది. ఇప్పుడు రెండో కూతురు ఖుషీ కూడా తెరంగేట్రం చేయనుంది.