Breaking News

పార్టీ బలోపేతాని పాటుపడుతా

పార్టీ బలోపేతానికి పాటుపడుతా

సామాజిక సారథి, నల్లగొండ: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నల్లగొండ జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా నల్లగొండకు చెందిన యువజన నాయకుడు సింగం లక్ష్మి నారాయణ నియామకమయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆదేశాలతో నల్గొండ పార్లమెంటరీ కన్వీనర్ పిట్ట రామ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సింగం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకపోతూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయడం సంతోషంగా ఉందని, నల్లగొండ జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేస్తాన్నారు. తనను గుర్తింపునిచ్చి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ అధినాయకురాలు షర్మిళకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కో- కన్వీనర్ మహమ్మద్, ఫయాజ్ అహ్మద్ లకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపాపారు.