![ర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/jgg-1f.jpg?fit=620%2C306&ssl=1)
సారథి, జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా జగిత్యాల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ, డీఎఫ్ వో వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.