Breaking News

సీఎం కేసీఆర్​కు రుణపడి ఉంటాం

సీఎం కేసీఆర్​కు రుణపడి ఉంటాం

సారథి, చొప్పదండి: కరీంనగర్ ​జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్​వీ నాయకుడు నరేష్ రావన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్​చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేష్ రావణ్ మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్​ప్రవేశపెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్​నీరజాభూంరెడ్డి, 9వార్డు కౌన్సిలర్ కొత్తూరి మహేష్, 10వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర భారతి నరేష్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.