సామాజిక సారథి, నాగర్కర్నూల్: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షుడు వసీం రిజ్వీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వివిధ ముస్లిము సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనల అనంతరం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జామియా మస్జీద్ కమిటీ అధ్యక్షుడు జైనులాబుద్దిన్ మాట్లాడుతూ ముస్లిముల పవిత్ర గ్రంథమైన దివ్య ఖురాన్ లోని పలు ఆయత్ లు(శ్లోకాలు) తొలగించాలని వసీం రిజ్వీ ఇటీవల సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా కోర్టు తిరస్కరించిందన్నారు. దీంతో తాను రచించిన గ్రంథంలో మహ్మద్ ప్రవక్తను కించ పరిచే విధంగా, దివ్య ఖురాన్ గురుంచి అనుచితంగా రాశాడన్నారు. వసీం రిజ్వీ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన వివిధ ముస్లిము సంఘాల నేతలు, మతపెద్దలు, యువత పాల్గొన్నారు.
- December 4, 2021
- Archive
- లోకల్ న్యూస్
- కఠినంగా
- కర్నూల్
- నాగర్
- రిజ్వీని
- వసీం
- శిక్షించాలి
- Comments Off on ‘వసీం రిజ్వీని కఠినంగా శిక్షించాలి’