![చెరువుగట్టుపై గుర్తు తెలియని మృతదేహం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/23HSB02.jpg?fit=576%2C628&ssl=1)
సామాజిక సారథి, నార్కెట్ పల్లి: నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతిచెందాడు. పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని వినాయక విగ్రహం ప్రక్కనున్న భక్తుల విశ్రాంతి షెడ్డు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయంపై దేవస్థానం సూపరింటెండెంట్ గుజ్జుల తిరుపతిరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.యాదయ్య పేర్కొన్నారు.