![క్రేన్పడి ఇద్దరు రైతుల మృత్యువాత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/HSBD33-F.jpg?fit=705%2C334&ssl=1)
- బల్లూనాయక్ తండాలో విషాదం
సారథి న్యూస్, హుస్నాబాద్: బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పైనపడి ఇద్దరు రైతులు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాలో గురువారం చోటుచేసుకుంది. హుస్నాబాద్ ఎస్సై ఎస్. శ్రీధర్ కథనం మేరకు.. ఇదే తండాకు చెందిన లావుడ్య దుర్గ, దేవోజికి సంబంధించిన వ్యవసాయ బావిలో పూడిక తీస్తుండగా ప్రమాదవశాత్తు క్రేన్ విరిగి బావిలో పడిపోయింది. దీంతో బావిలో పనిచేస్తున్న నలుగురి మీద క్రేన్ పడి లావుడ్య బీమా(56), లావుడ్య చాంది(45) అనే ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. లావుడ్య సరోజన, ఇస్లావత్ వెంక్య తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం హుస్నాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బల్లూనాయక్ తండాకు చెందినవారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.