Breaking News

నూతన కార్యవర్గానికి సన్మానం

నూతన కార్యవర్గానికి సన్మానం

సారథి, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి కురుమ యువజన సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని మంగళవారం మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ రాజన్నల రాజు, ప్రణీత సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువజన సంఘలు సేవాభావంతో పనిచేయాలని కోరారు. యువజన సంఘం అధ్యక్షుడిగా బండారి అనిల్, ఉపాధ్యక్షుడిగా గుంటి సాగర్, ప్రధాన కార్యదర్శిగా రాజన్నల శేఖర్, సంయుక్త కార్యదర్శిగా భూమల్లా సాగర్, కోశాధికారిగా గుంటి శ్యాంకుమార్, కన్వీనర్ గా ఏముండ్ల రాజ్ కుమార్, కోకన్వీనర్ గా జాతరకొండ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా పెద్ది సంపత్, జిట్టా నాగార్జున, పెద్ది రాజేశం ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు దాసరగొండ రవి, పెద్దకురుమ వెంకన్న పాల్గొన్నారు.