Breaking News

జవాన్లకు సాయమే అందలేదు

జవాన్లకు సాయమే అందలేదు
  • రైతులకు అందడానికి ఎన్ని యుగాలు పడుతుందో
  • బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​ప్రవీణ్‌ కుమార్​

సామాజిక సారథి, హైదరాబాద్‌: గల్వాన్‌ లోయ ఘటనలో అమరులైన జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం ఇంకా అందలేదని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో రైతు చట్టాలను రద్దు చేయాలని ఏడాదిగా చేస్తున్న నిరసనల్లో చనిపోయిన రైతు కుటుంబాలకు తాజాగా సీఎం కేసీఆర్‌ ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. కాగా, అప్పుడెప్పుడో జవాన్లకు ప్రకటించిన సాయమే ఇంకా అందలేదు.. మరి రైతులకు మొన్న ప్రకటించిన సాయం అందడానికి ఇంకా ఎన్ని యుగాలు పడుతుందో అని ఆయన ఎద్దేవాచేశారు. ‘గత జూన్‌ లో గల్వాన్‌ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్లందరికీ తెలంగాణ ప్రభుత్వం కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించి నేటికి 17 నెలలు అవుతుంది. కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి తప్ప మిగతా 19 మందికి ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదు. వీరజవాన్లకే ఈ పరిస్థితి ఉంటే.. మరి ఇటీవలే ప్రకటించిన 700మంది రైతు కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా అందడానికి ఇక ఎన్ని యుగాలు పడుతుందో?!’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.