Breaking News

రైతును రాజు చేయడానికే రైతు బంధు

రైతును రాజు చేయడానికే రైతు బంధు

సామాజిక సారథి, భూపాలపల్లి: దేశానికి వెన్నెముఖ అయిన రైతును రాజును చేయడానికి రైతు బంధు పథకంను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారన్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో  వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి  అధ్యక్షతన రంగవల్లుల జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్ని మహిళ మహారాణులు వేసిన ముగ్గుల ను పరిశీలించి అనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో  మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సత్యవతి రాథోడ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, గండ్ర జ్యోతి రెడ్డి పాలోన్నారు.