Breaking News

అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

అడ్వకేట్​ దంపతులను హత్యచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: సమాజంలోని ఎంతో మంది పేదలు, అన్యాయానికి గురైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించే గట్టు వామన్ రావు, అతని భార్యను దారుణంగా చంపివేయడం చాలా బాధాకరమని బ్రాహ్మణ సమాజం సేవా సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి, క్రిష్ణశర్మ, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రావు, రంగన్న, ఫణి, రాము, అనంత్ రాజ్, రవి, సంతోష్, సంగమేశ్వర్, మహేష్ శర్మ, కార్తీక్ తదితరులు ఈ చర్యను ఖండించారు.