Breaking News

కొట్రలో మినీబ్యాంకు ప్రారంభం

కొట్రలో మినీబ్యాంకు ప్రారంభం

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో గురువారం ఎస్​బీఐ కస్టమర్​సర్వీస్ ​పాయింట్​(మినీ బ్యాంకు)ను కల్వకుర్తి బ్రాంచ్ ​మేనేజర్ శివశ్రావణ్​ కుమార్ ​ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊరులోనే నగదు పొందే సదుపాయాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాతాదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వర్​రావు, బీజేపీ నాయకుడు జూలూరి బాలస్వామి, వార్డు సభ్యులు కొప్పు హరిశ్చంద్రప్రసాద్, పొనుగోటి విష్ణువర్ధన్​రావు, నిర్వాహకులు సిద్ధు, రాము, రవి, శ్రీను, గణేష్, లక్ష్మణ్, జి.నిరంజన్, ఎన్​.శ్రీనివాసులు, ఎం.లాలుప్రసాద్​​ పాల్గొన్నారు.

గ్రామస్తులు, ఖాతాదారులతో ఎస్​బీఐ కల్వకుర్తి మేనేజర్​ శివశ్రావణ్​కుమార్​