సారథి న్యూస్, బిజినేపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నానిర్వహించిన అనంతరం ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు. తమకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, జీవో నం.51ను సవరించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోగా జీతం వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేకహోదా కల్పించాలని కోరారు. మెమో నంబర్2021ను వెనక్కి తీసుకోవాలని కోరారు. రోజుకు 8 గంటల పనివిధానం అమలు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ బిజినేపల్లి మండలాధ్యక్షుడు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులు శ్రీశైలం, శంకర్, సురేష్, రాములు పాల్గొన్నారు.
- February 2, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BIJMRPALLY
- CITU
- PANCHAYATHI WORKERS
- పంచాయతీ వర్కర్లు
- బిజినేపల్లి
- సీఐటీయూ
- Comments Off on 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలే