Breaking News

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

సారథి, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నియోజకవర్గ దళితులపై చిత్తశుద్ధి, గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, దళితబంధు పథకాన్ని ఇక్కడ కూడా అమలుచేసేలా రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్​ ఎస్సీసెల్​ చొప్పదండి పట్టణాధ్యక్షుడు కనుమల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద కేవలం హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేస్తామని చెప్పడం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దళితులందరినీ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్​చేశారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు అందరికీ యూనిట్లు మంజూరయ్యేలా చూడాలని కోరారు.