![రాజన్న ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/vmd-2.jpg?fit=655%2C283&ssl=1)
సారథి, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన పలువురు ఉద్యోగులు బుధవారం రిటైర్డ్ అయ్యారు. ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రమౌళి, అర్చక, ఉపప్రధాన అర్చక గొప్పన్నగారి నాగన్న, ఈఏవో సంకేపల్లి హరికిషన్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి పేరుక శ్రీనివాస్ తో పాటు ఏఈవో బి.శ్రీనివాస్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, నాగుల మహేష్, వరి నరసయ్య, స్థానాచారి అప్పాల భీమాశంకర్, అర్చకస్వాములు తమ్మలి వెంకటయ్య, గొప్పన్నగారి చందు తదితరులు పాల్గొన్నారు.