Breaking News

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలి

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలి

సారథి, వెల్దండ: రేషన్ డీలర్లకు గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం వెల్దండ మండలాధ్యక్షుడు జంగయ్య ప్రభుత్వాన్ని కోరారు. రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు 25 ఏళ్లుగా చాలీచాలని కమీషన్లతో కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రేషన్ డీలర్ల కనీస వేతనం ఇవ్వాలని, జీవితబీమా వర్తింప చేయాలని, హమాలీ చార్జీలను ప్రభుత్వమే భరించాలని, రేషన్ షాపుల్లోకి వచ్చే సంచుల్లో తరుగు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​కు విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో వెల్దండ ఎంపీపీ విజయ, జడ్పీటీసీ విజితారెడ్డి, డీఎస్ వో మోహన్ బాబు, కార్యవర్గ సభ్యులు చంద్రకళ, వెంకటయ్య, కుచేలుడు, మల్లేష్, జగదీష్, గోపాల్, దేశ్య మైసయ్య, చంద్రశేఖర్ బాలరాజు, కుమార్, కిమ్యా, సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.