![సందడి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/08/bjpl1.jpg?fit=655%2C340&ssl=1)
సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్కర్నూల్జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/08/bjpl2.jpg?resize=640%2C336&ssl=1)
కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్రావు, నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర కార్యనిర్వాహక చైర్మన్వాస ఈశ్వరయ్య, పాలమూరు జోన్ అధ్యక్ష కార్యదర్శులు బండారు రాజశేఖర్, రఘునాథాచార్యలు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, డాక్టర్ కె.శ్రీనివాసరెడ్డి ఐఆర్ఎస్, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ బాలకిష్టారెడ్డి, జీహెచ్ఎంసీ సీసీపీ సందడి నరేందర్ రెడ్డి, సందడి ప్రతాప్రెడ్డి, నరేందర్రెడ్డి తదితరులు రంగారెడ్డి సేవలను కొనియాడారు. రంగారెడ్డి ఆధ్యాత్మిక చింతనలో ఆయన ఆశయాలకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు రంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్మరణ సభకు దాదాపు నాలుగొందల మందికిపైగా హాజరయ్యారు.