Breaking News

రంగారెడ్డి మార్గదర్శకులు

సందడి

సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త దివంగత సందడి రంగారెడ్డి వైష్ణవ సంస్కృతి వ్యాప్తికి, ఆధ్యాత్మిక భావాల ప్రాచుర్యానికి మార్గదర్శకులని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధ జీయర్​స్వామి కొనియాడారు. స్వర్గీయ రంగారెడ్డి సంస్మరణ సభను ఆదివారం నాగర్​కర్నూల్​జిల్లా వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి మండలి చైర్మన్ ​అనంత నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

సంస్మరణ సభలో మాట్లాడుతున్న ప్రముఖులు

కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్​రావు, నాగర్​కర్నూల్​ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి, వికాస తరంగిణి రాష్ట్ర కార్యనిర్వాహక చైర్మన్​వాస ఈశ్వరయ్య, పాలమూరు జోన్ ​అధ్యక్ష కార్యదర్శులు బండారు రాజశేఖర్, రఘునాథాచార్యలు, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, డాక్టర్​ కె.శ్రీనివాసరెడ్డి ఐఆర్ఎస్, నల్సార్​ న్యాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ​బాలకిష్టారెడ్డి, జీహెచ్​ఎంసీ సీసీపీ సందడి నరేందర్ రెడ్డి, సందడి ప్రతాప్​రెడ్డి, నరేందర్​రెడ్డి తదితరులు రంగారెడ్డి సేవలను కొనియాడారు. రంగారెడ్డి ఆధ్యాత్మిక చింతనలో ఆయన ఆశయాలకు కృషి చేస్తామన్నారు. అంతకుముందు రంగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్మరణ సభకు దాదాపు నాలుగొందల మందికిపైగా హాజరయ్యారు.