Breaking News

కలెక్టర్​ను కలిసిన రాజన్న ఆలయ పీఆర్వో

కలెక్టర్​ను కలిసిన రాజన్న ఆలయ పీఆర్వో

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు కరీంనగర్ ​జిల్లా నూతన కలెక్టర్​కర్ణన్ ను బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఖ‌మ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభిషేకం లడ్డూప్రసాదం అందజేసి ఆనందం వ్యక్తం చేశారు.