![రూ.10వేల ఆర్థిక సాయం అందజేత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/alp11.jpg?fit=541%2C340&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బోయ దంతేశ్వరి కుమార్తె కుటుంబాన్ని ఆదివారం జడ్పీటీసీ కాశపోగు రాజు పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. దంతేశ్వరి కుమార్తె నివాస గుడిసె ఇటీవల కరెంట్ షార్ట్సర్క్యూట్తో కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట తనగల సర్పంచ్ రాణి, ఎంపీపీ భర్త రాజు, టీఆర్ఎస్ నాయకులు రాముడు, జయ్యన్న, అడ్హక్ కమిటీ సభ్యుడు క్యాతూర్ నరేంద్ర, రవికుమార్, మహేష్, జనార్ధన్, సురేష్, రత్నం, ప్రకాశ్, శ్రీను పాల్గొన్నారు.