Breaking News

‘కీచకుడు’ కటకటాల పాలు

‘కీచకుడు’ కటకటాల పాలు
  • 9 మందిపై పోలీసుల కేసు
  • సామాజికసారథి’ వరుస కథనాలతో కదిలిన పోలీసు యంత్రాంగం

సామాజికసారథి, బిజినేపల్లి: కారుకొండ గ్రామంలో గౌరమ్మ అనే మహిళపై అత్యాచారం.. ఆపై ఆమెను మోసగించి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు మిద్దె బాలస్వామిని మంగళవారం రిమాండ్​కు తరలించినట్లు నాగర్ కర్నూల్ సీఐ హనుమంతు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆయనతో పాటు మరో 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులంతా ఒకే కుటుంబ చెందిన వారు. గౌరమ్మ అనే మహిళను కిడ్నాప్, మోసం, భర్తపై దాడి చేయించడం వంటి ఆరోపణలతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, బాధితులు ‘సామాజికసారథి’ ‘యు న్యూస్’ ప్రతినిధులను ఆశ్రయించడంతో వరుస కథనాలు ప్రచురించడంతో ఐద్వా, కేవీపీఎస్ తదితర​ప్రజాసంఘాల వరుస పోరాటాలతో నిందితులపై కేసు నమోదు చేశారు.

3 thoughts on “‘కీచకుడు’ కటకటాల పాలు

  1. చిలుక ప్రవీణ్ అన్న ఈ పేపరు ప్రస్తావనం చేయడం వల్ల నేను చదవడం నేర్చుకుంటున్నా

  2. చిలుక ప్రవీణ్ అన్న చెప్పడం ద్వారా నేర్చుకున్నాను

Comments are closed.