![ఎమ్మెల్సీగా పోచంపల్లి నామినేషన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/22HSB09.jpg?fit=1152%2C446&ssl=1)
సామాజిక సారథి, వరంగల్ జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, ఎమ్మెల్యేలు, నరేందర్ వినయ్ భాస్కర్ మేయర్ గుండు సుధారాణిలు ఉన్నారు. తెలంగాణలో కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఎమ్మెల్సీ బండా ప్రకాష్, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.