Breaking News

హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

హెచ్ సీఏలో జగిత్యాల జిల్లావాసికి చోటు

సారథి ప్రతినిధి, జగిత్యాల: కొత్తగా ఏర్పడిన జిల్లాల నుంచి హెచ్ సీఏలో ఆరుగురు సభ్యులను అధ్యక్షుడు మహమద్ అజారుద్దీన్ శనివారం నియమించారు. రాష్ట్రంలో క్రికెట్ ను మరింత విస్తరించేందుకు హైదరాబాద్ ‌క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) చర్యలు చేపట్టింది. తెలంగాణలో పెరిగిన ‌జిల్లాల సంఖ్యకు అనుగుణంగా హెచ్ సీఏ సభ్యుల సంఖ్యను సైతం పెంచి, అన్ని జిల్లాల్లో యువక్రీడాకారులను ప్రోత్సాహించనుంది. అందులో భాగంగా పలు కొత్త జిల్లాలకు సభ్యత్వం కల్పించారు. జిల్లా ‌కోటాలో వాల శరత్ చంద్ర, మఠం భిక్షపతి, బుద్దుల శ్రవన్ రెడ్డి, దాదన్నగారి సందీప్ కుమార్, దావ సురేష్, కల్కుంట్ల మల్లికార్జున్ ని హెచ్సీఏ ఏజీఎంలో సభ్యులుగా తీసుకున్నారు. వీరిని పలు జిల్లాల అడ్ హక్ కార్యదర్శులుగా నియమిస్తూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. నూతన అడ్ హాక్ కార్యదర్శులు, సొసైటీస్ చట్టం ప్రకారం సంబంధిత జిల్లా క్రికెట్ అసోసియేషన్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించనున్నారని హెచ్ సీఏ ప్రకటించింది. తద్వారా మారుమూల ప్రాంతాల యువతకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, నైపుణ్యాలను ‌పెంపొందించనున్నట్లు అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.