Breaking News

పెట్రోధరలు తగ్గించాలి

పెట్రోధరలు తగ్గించాలి

సారథి, కొల్లాపూర్: కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలను పీడిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మండిపడ్డారు. బుధవారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినూత్నరీతిలో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా పరిస్థితుల్లో పేదలను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి, ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు హరికృష్ణ, మండల నాయకులు ఓమేష్, భాను, శివ,నరసింహ, మధు తదితరులు పాల్గొన్నారు.