Breaking News

26 నుంచి కొత్త రేషన్ కార్డులు

26 నుంచి కొత్త రేషన్ కార్డులు

  • ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ
  • సీఎం కేసీఆర్​ వెల్లడి

సారథి, హైదరాబాద్: ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హులైన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. జులై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నుంచి రేషన్ బియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను సీఎం కేసీఆర్​ ఆదేశించారు.