Breaking News

కరోనాతో సర్పంచ్ మృతి

కరోనాతో సర్పంచ్ మృతి

సారథి, రామాయంపేట: కరోనా బారినపడి మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామ సర్పంచ్ కర్రెయ్య(63) చనిపోయారు. కొవిడ్​ నిర్ధారణ కావడంతో రామయంపేటలోని ఐసొలేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రతిరోజూ ఉదయం టీవీఎస్ మోటార్ సైకిల్ పై గ్రామంలో వాడవాడలా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకునే వాడని గ్రామస్తులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.