![ముదిరాజ్ కమిటీ ఎన్నిక](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/25HSB04.jpg?fit=1059%2C517&ssl=1)
సామాజిక సారథి, తిమ్మాజిపేట: మండలంలోని నీలగిరిలో ముదిరాజ్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు కావలి లక్ష్మయ్య తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షుడిగా అంజయ్య, ప్రధాన కార్యదర్శిగా సుంకరి రాజు, గౌరవ అధ్యక్షుడిగా చెన్నకేశవులు, కోశాధికారిగా అంజయ్య, ప్రచార కార్యదర్శిగా బాలస్వామితో పాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.