సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగంరాయ్ తండా గ్రామంలో గురువారం రాత్రి షార్ట్సర్క్యూట్తో రెండు పూరి గుడిసెలు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి స్పందించారు. ఈ మేరకు శనివారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లొరి రాజు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుంచే ఎమ్మెల్యేకు బాధితులు తమ స్థితిగతులను వివరించగా, అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమె భరోసా కల్పించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రమేష్, ఉపసర్పంచ్ రవి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, భాగరెడ్డి, మల్లేష్, మణికుమార్, లాలు తదితరులు పాల్గొన్నారు.
- January 23, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- Comments Off on బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా