![రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/mada.jpg?fit=655%2C380&ssl=1)
సారథి, వేములవాడ: దక్షిణకాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తొగుట పీఠం శ్రీశ్రీశ్రీ మాధవానందస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి పూజల అనంతరం కల్యాణమండపంలో పాదపూజ చేశారు. వారి వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, అర్చకస్వాములు పాల్గొన్నారు. అలాగే ఒకేరోజు సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి రూ.20లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.