Breaking News

సీఎం దృష్టికి ఎంపీటీసీల సమస్యలు

ఎంపీటీసీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్దాం

సారథి, హైదరాబాద్: హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యుల సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీల సంఘం రాష్ట్ర నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొని పలు తీర్మానాలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను కలిసి సీఎం కేసీఆర్ ​వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించాలని, అన్ని జిల్లాల్లో కలెక్టర్ లకు వినతిపత్రం ఇవ్వాలని, ఆగస్టులో హైదరాబాద్ లో ఎంపీటీసీల సభ నిర్ణయించాలని, ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి ఏపీ ప్రభుత్వం తరహాలో జీవో ఇవ్వాలని, 2021బడ్జెట్ లో పెట్టిన రూ.248కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రంలో కరోనా, అనారోగ్యంతో చనిపోయిన ఎంపీటీసీలకు రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని.. తదితర తీర్మానాలు చేశారు.