Breaking News

రైల్వే పనులకు భూసేకరణ

రైల్వే పనులకు భూసేకరణ

సారథి, వేములవాడ: నూతనంగా నిర్మాణం చేపట్టే కొత్తపల్లి, మనోహరబాద్ రైల్వే బ్రాడ్ గేజ్ నిర్మాణ పనుల కోసం అణు పురం, నాంపల్లి గ్రామాల్లో ప్రజాసేకరణ కార్యక్రమం నిర్వహించారు. అణుపురంలో 15.12 ఎకరాలు, నాంపల్లిలో 47.0.7 ఎకరాలను సేకరించారు. సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ అధికారికి గ్రామస్తులు సమ్మతి తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ తహసీల్దార్ పి.మునీందర్, నక్క శ్రీనివాసస్, తహసీల్దార్ వేములవాడ రూరల్ నరేష్ ఆనంద్, ఎంపీడీవో మ్యాకల రవి, జడ్పీటీసీ జడల శ్రీనివాస్, ఎర్రం మధు పాల్గొన్నారు.