Breaking News

వనస్థలిపురంలో కి’లేడీ’ అరెస్ట్

  • February 12, 2021
  • Archive
  • Comments Off on వనస్థలిపురంలో కి’లేడీ’ అరెస్ట్
వనస్థలిపురంలో కి'లేడీ' అరెస్ట్

  • గతంలో ఆరుగురు ఎస్సైల బ్లాక్ మెయిల్
  • ఎట్టకేలకు అట్రాసిటీ కేసులో అరెస్ట్​

సారథి న్యూస్​, ఎల్​బీనగర్​: అమాయకులకు వలవేసి.. అవసరాలకు వాడుకుంటూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుతున్న ఓ మాయ‘లేడీ’ని పోలీసులు గురువారం అరెస్ట్​చేశారు. పోలీసుల కథనం మేరకు.. వనస్థలిపురం పరిధిలో నివాసం ఉంటున్న ఎలిమినేటి శ్రీలతరెడ్డి స్థానికంగా టైలర్​షాపు నిర్వహిస్తోంది. కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటోంది. కొంతమంది ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారితో గొడవపడింది. ఈ ఘర్షణలో ఓ మహిళ తల పగిలింది. ఈ ఘటనలో శ్రీలతరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు.
పోలీసులకు వలపు వలవేసి!
పోలీసులు ఆమె గురించి ఆరా తీయగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగింది. అయితే అతనితో గొడవపడి వనస్థలిపురం స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వనస్థలిపురం ఎస్సై రామయ్య, కానిస్టేబుళ్లు నాగరాజు, రాజు తనను మానసికంగా వేధించారని, అర్ధరాత్రి ఫోన్ చేసి వేధిస్తున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసింది. ఎస్సైలు రాజేందర్​రెడ్డి, అతని స్నేహితుడు ఎస్సై మధుసూదన్​రెడ్డి, అతని స్నేహితుడు ఎస్సై అరుణ్​కుమార్ తో స్నేహంగా ఉన్నట్టు నటించి వారిపై కేసులు పెట్టించి డబ్బులు డిమాండ్​చేసింది. ఎంతైనా ప్రభుత్వ ఉద్యోగులు కదా.. చేసేదేమీలేక ఆ మహిళకు డబ్బులు ఇచ్చి కేసులు మాఫీ చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం తన కూతురును రేప్​చేశారని తాను సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తిపై మరోకేసు పెట్టి జైలుకు పంపింది. ఇలా ప్రతిసారి పోలీసుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఈ మాయలేడీ అందరికీ వలవేస్తూ డబ్బులు లాగుతూ ఉంటుంది. చివరికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో శ్రీలతరెడ్డి కటకటాల్లోకి వెళ్లింది.