Breaking News

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు

సామాజిక సారథి, తిమ్మాజిపేట: నాగర్​కర్నూల్ ​జిల్లా తిమ్మాజిపేట మండలంలోని చేగుంట గ్రామంలో శనివారం రాత్రి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉట్టికొట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి. సర్పంచ్ బి.లావణ్య, ఎంపీటీసీ సభ్యుడు పిల్లమల్ల మల్లయ్య, పలువురు గ్రామపెద్దలు పాల్గొన్నారు.