Breaking News

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, శ్మశానవాటికకు స్థలపరిశీలన

ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, శ్మశానవాటికకు స్థలపరిశీలన

సారథి, రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అత్యాధునిక సమీకృత మార్కెట్, శ్మశానవాటిక నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని కరీంనగర్​ జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం ఏఈ అజయ్ పరిశీలించారు. ఇటీవల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ.రెండుకోట్లు, శ్మశానవాటిక కు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్​తరఫున స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పబ్లిక్ హెల్త్ డిపార్ట్​మెంట్​ దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి వెంట కమిషనర్ దుర్గం శ్రీనివాస్ గౌడ్, టీఆర్​ఎస్​ యువ నాయకులు మోర రామ్మూర్తి, ఎలిగేటి అనిల్ కుమార్ ఉన్నారు.