Breaking News

బాలకృష్ణగారితో నటించడం నా అదృష్టం– దునియా విజయ్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘వీరసింహారెడ్డి’. శ్రుతి హాసన్ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో సినిమాలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్‌తో మూవీ విశేషాలు..బాలకృష్ణ గారి సినిమాలో అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ కథలో విలన్ పాత్ర ఒక పిల్లర్ లా వుంటుంది. ప్రేక్షకులకు గుర్తుండిపోయే రోల్‌. గోపీచంద్‌ నా వర్క్ ని చూసి, ఈ పాత్రకు నేను అయితే సరిపోతానని నన్ను సెలెకట్‌ చేసారు. నా లుక్‌ చాలా మొరటుగా వుంటుంది. ఇందులో నా పాత్ర పేరు ముస‌లిమ‌డుగు ప్రతాప్ రెడ్డి. బాలకృష్ణ గారు గొప్ప వ్యక్తిత్వం వున్న మనిషి. ఆయనతో కలసినటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. ఈ మూవీలో ఫైట్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. వేరే ఎనర్జీ వుంటుంది. ప్రేక్షకులు ఆ ఎనర్జీని థియేటర్ లో ఫీలౌతారు. ఇది అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ. నటన, దర్శకత్వం రెండు వేరు వేరు. దర్శకుడిగా నటుల నుండి యాక్టింగ్ రాబట్టుకోవాలి. నటుడిగా వున్నపుడు నా పని నటించడమే. నటుడిగా చేస్తున్నపుడు నా దృష్టి అంతా కేవలం నటనపైనే వుంటుంది. దర్శకుడు నా నుండి ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్ వుంటుంది. నాకు తెలుగు హీరోలు అందరూ ఇష్టమే. ఎవరి ప్రత్యేకతలు వారికి వున్నాయి. మంచి పాత్రలు వస్తే విలన్ గా చేయడానికి సిద్ధమే. ఒక నటుడిగా అన్ని పాత్రలు చేయాలని వుంటుంది. ప్రస్తుతం ‘భీమా’ అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతోంది. తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. పాత్ర బలంగా వుంటే తప్పకుండా చేస్తాను.