Breaking News

ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి

ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి

సారథి, అచ్చంపేట: అధికారుల వేధింపుల కారణంగానే ఆర్టీసీ రాణిగంజ్‌ డిపో–1 డ్రైవర్‌ తిరుపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్​చేస్తూ నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా యూనియన్​నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. అధికారుల వేధింపులతో తిరుపతిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. వేధింపులకు పాల్పడిన అధికారులపైనా తగిన చర్య తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. చిన్న చిన్న కారణాలు చూపించి యాజమాన్యం వేధింపులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నిమిషాలు లేటైనా డ్యూటీ ఇవ్వకుండా రోజుల తరబడి తిరిగేలా అప్​సెంట్ వేసి జీతాల్లో కోత విధిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆర్టీసీ నాయకులు ఎస్.వెంకటయ్య, బాలాజీ, జైగోపాల్, లలిత, ఆంజనేయులు, బాలయ్య పాల్గొన్నారు.