Breaking News

జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

సారథి, బిజినేపల్లి: జేఎస్​డబ్ల్యూ పెయింట్స్ ​సంస్థ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల స్కూలు విద్యార్థి బి.శివకుమార్ ​ఉత్తమ ప్రతిభ చాటాడు. గురువారం స్కూలు ఆర్ట్​ టీచర్​ భాగ్యమ్మ, ప్రిన్సిపల్​తో కలిసి గురుకుల విద్యాలయాల సంస్థ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి బి.శివకుమార్​ను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహించిన తీరును అభినందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా, బి.శివకుమార్ ​తెల్కపల్లి మండలం జమిస్తాపూర్ ​గ్రామానికి చెందినవాడు. 2020-21విద్యాసంవత్సరంలో 10వ తరగతి పూర్తిచేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తమ కొడుకు జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చాటడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు శివకుమార్​ను అభినందించారు.