Breaking News

వీహెచ్ పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వీహెచ్ పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

సారథి, చొప్పదండి: తెలంగాణలో గోహత్యలు, గోరక్షకులపై దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్(వీహెచ్​పీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్​పీ మండలాధ్యక్షుడు పడకంటి కృష్ణ మాట్లాడుతూ.. గోరక్షకుడు సంజయ్ పై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని, గో అక్రమ రవాణా గ్యాంగ్ ల పై పీడీ యాక్టు నమోదు చేయాలని, గోవుల అక్రమ రవాణా నిలుపుదలకు శాశ్వత చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని కోరారు. గోవధ శాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి పొన్నాల తిరుపతి, కోశాధికారి దండే మహేష్, రాంలీల కోకన్వీనర్ బత్తిని ప్రశాంత్, తాడూరి శివకృష్ణ, గుర్రం సమర్ రెడ్డి, పరమేష్, రేసవేని వేణు, చిలుముల కార్తిక్, ఎనగందుల అజయ్ పాల్గొన్నారు.